Search This Blog

Sunday 17 June 2018

మకరతోరణం - MAKARATORANAM


 మకరతోరణం


మనదేవాలయాలలో  ప్రతిదేవతావిగ్రహానికి మకరతోరణంతోఅలంకరిస్తారు.ఆ మకరతోరణం గురించి......

వివిధ దేవాలయాలలో ద్వారతోరణ మధ్య భాగంలో ఒక కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షసముఖం కనబడుతుంది.

దానికే మకరతోరణమని పేరు.ఈ రాక్షస ముఖాన్ని తోరణ మధ్యంలో అలంకరించటానికి గల కారణమును గురించి స్కందమహాపురాణంలో ఒక కథ ఉన్నది.

పూర్వం "కీర్తిముఖుడ"నే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేకవరములను పొంది అలా వచ్చిన బలపరాక్రమాలతో సమస్తభువనములలోని సంపదలను తన సొంతం చేసుకున్నాడు.

చివరకు నారదుని ప్రేరణతో పరమశివపత్ని అయిన జగన్మాతను కూడా పొందాలని ఆశపడ్డాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మ్రింగివేయమని అతిభీకరమైన అగ్నిని సృష్టించాడు. లోకాలను అన్నింటినీ మ్రింగివేస్తూ ఆ అగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది.

 మరణంలేకుండా వరం పొందిన కీర్తిముఖుడు ఆ అగ్నితననుఎక్కడదహించి వేస్తుందో అని భయంతో పరుగులుతీస్తూఅన్నిలోకాలలో తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని శరణు వేడాడు. భక్తవశంకరుడైన శివుడు ఆ రాక్షసుణ్ణి రక్షించటంకోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడవకన్నుగా దానిని ధరించాడు.

ఆ తరువాత కీర్తిముఖుడు తనకు తట్టుకోలేనంత ఆకలిగా ఉన్నదని తను తినటానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుని కోరాడు. యుక్తిగా శివుడు "నిన్ను నువ్వే తిను" అని చెప్పాడు.

శివుని వచనానుసారం మొసలి రూపును ధరించి ఆ కీర్తిముఖుడు తనను తాను ముందుగా తోకభాగం నుంచి తినటం మొదలు పెట్టాడు. తన శరీరాన్ని అలా తింటూ తింటూ కంఠం వరకూ తిన్నాడు. తన తలను తానే ఎలాతినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి ఇంకా తీరలేదు. శివుని ప్రార్థించాడు.

నీవుఈనాటినుంచి సమస్తదేవతాలయాలలో తోరణాగ్రభాగాన్ని అలంకరించు.

 దేవతా దర్శనానినికి వచ్చే ప్రజలందరిలో ఉండే దుష్టమైన అహంకారాన్ని, ఆశను,తింటూఉండు.నీవుఅందరికీ పూజనీయుడవు అవుతావు"అని వరమిచ్చాడు.

ఆనాటినుంచి కీర్తిముఖుడు దేవతాలయాలలోని తోరణామధ్యభాగాన్ని తన రాక్షస మకర ముఖంతో అధిష్ఠించి అలంకరించి భక్తులలో ఉండే దుష్టవికారాలను, అహంకారాన్ని,దురాశను కబళిస్తూ విరాజిల్లుతున్నాడు.

అందుకనే దేవతామూర్తుల వెనుకనుండే తోరణానికి మకరతోరణం అని పేరు వచ్చింది...........సేకరణ       ..........శశిధర్

🌻🦋🍁🎄🌲💐🍃🌱🌹🔥🌴🎋🌾🍂🌳🌷💠🌿

No comments:

Post a Comment